బాబు ఇంకా వర్చువల్ వరల్డ్ లోనే ఉన్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా తన వర్చువల్ వరల్డ్ లోనే ఉన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని సజ్జల [more]

Update: 2020-08-26 07:56 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా తన వర్చువల్ వరల్డ్ లోనే ఉన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్వార్థానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని సజ్జల అన్నారు. తన పరిపాలనలో పూర్తిగా అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారం కోల్పోయి 14 నెలలు దాటినా చంద్రబాబులో మార్పు రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పనిగట్టుకుని విమర్శలు చేస్తుందన్నారు. ప్రజల వద్దకు పాలన తీసుకెళితే విధ్వసం ఎలా అవుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో ఉండి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కూడా అడ్డుకుంటున్నారన్నారు.

Tags:    

Similar News