ఆ విషయంపై నోరు పెగలదేం?

పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చంద్రబాబేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ మరింత మెరుగుపడిందన్నారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు [more]

Update: 2021-07-13 12:53 GMT

పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చంద్రబాబేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో పంచాయతీ వ్యవస్థ మరింత మెరుగుపడిందన్నారు. చంద్రబాబు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. సంగం డెయిరీ విషయంలో నిందితులు ఎవరో త్వరలోనే తెలుస్తుందని అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా కృష్ణా నీటిని తోడేస్తున్నా చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారన్నారు. జిల్లాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు చంద్రబాబు దిగారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.

Tags:    

Similar News