జగన్ పోటీ చేస్తున్నాడనే అనుకోండి

తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తున్నాడని భావించి ప్రజలు ఓటు వేయడానికి తరలి రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ కు [more]

Update: 2021-04-16 01:14 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ పోటీ చేస్తున్నాడని భావించి ప్రజలు ఓటు వేయడానికి తరలి రావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు నిచ్చారు. జగన్ కు ప్రజలపై ఉన్న నమ్మకం తిరుపతి ఫలితం ద్వారా మరోసారి రుజువవుతుందని ఆయన తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను జగన్ నిలిపివేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. టీడీపీ, బీజేపీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. రెండు పార్టీలనూ ప్రజలు ఛీకొట్టినా వారిలో మార్పు రాలేదని సజ్జల రామకృష్ణారెడ్డి మండి పడ్డారు. జగన్ కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు.

Tags:    

Similar News