చంద్రబాబుకు నోటీసులు ఊరికే ఇవ్వలేదు

చట్ట ప్రకారమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నోటీసులకు ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. [more]

Update: 2021-03-18 01:12 GMT

చట్ట ప్రకారమే టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నోటీసులకు ఇంత భయపడాల్సిన అవసరం ఏముందని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అమరావతి రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సజ్జల అభిప్రాయపడ్డారు. దళితుల భూములను తీసుకుని వారికి అన్యాయం చేశారన్నారు. తమ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు హాజరై దర్యాప్తునకు సహకరించాలని కోరారు. దళితుల భూములను భయపెట్టి లాక్కున్నారన్నారు.

Tags:    

Similar News