వైసీపీ నేతలకు తీపి కబురు చెప్పిన సజ్జల

వైసీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి తీపి కబురు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. [more]

Update: 2020-03-06 12:54 GMT

వైసీపీ నేతలకు సజ్జల రామకృష్ణారెడ్డి తీపి కబురు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. నామినేటెడ్ పోస్టులను వచ్చే నెల చివరి వారంలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. దేశంలోనే జగన్ అత్యంత శక్తిమంతమైన నేత అని సజ్జల తెలిపారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఖజానాను ఖాళీ చేసి వెళ్లినా జగన్ మాత్రం సంక్షేమ కార్యక్రమాలను ఆపడం లేదని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News