రెండో విడతలోనూ 80 శాతం విజయం మాదే

ఊహించిన విధంగానే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గెలిచిన తమ పార్టీ మద్దతుదారుల వివరాలను ఆధారాలతో కూడా ఇస్తామని [more]

Update: 2021-02-15 00:40 GMT

ఊహించిన విధంగానే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గెలిచిన తమ పార్టీ మద్దతుదారుల వివరాలను ఆధారాలతో కూడా ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ వివరాలను వెబ్ సైట్ లో ఉంచానని చెప్పారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలోనూ 80 శాతం విజయం సాధించామని తెలిపారు. ఫేక్ వెబ్ సైట్ తో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అతి తక్కువ స్థానాలను గెలుచుకుని టీడీపీ నేతలు ఎందుకు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

Tags:    

Similar News