అక్రమ ప్రాజెక్టులు కట్టింది తెలంగాణాయే

అక్రమంగా ప్రాజెక్టులు కట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమం కాదా? అన ప్రశ్నించారు. నిజానికి కృష్ణా జలాలపై [more]

Update: 2021-07-10 08:05 GMT

అక్రమంగా ప్రాజెక్టులు కట్టింది తెలంగాణ ప్రభుత్వమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అక్రమం కాదా? అన ప్రశ్నించారు. నిజానికి కృష్ణా జలాలపై ఎలాంటి వివాదం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం గతంలో రాయలసీమకు నీళ్లందించాలని చెప్పారన్నారు. ఇప్పుడు మాత్రం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులను కట్టిందన్నారు. ఏపీ రైతుల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News