ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలి

Update: 2018-07-31 11:31 GMT

ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాల వంటి దురాచారాల నుంచి తప్పించుకునేందుకు ముస్లిం యువతులు హిందూ యువకులను పెళ్లి చేసుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి ప్రాచీ. మథురలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడుతూ... దురాచాలపై పోరాడుతున్న ముస్లిం మహిళలను కలిసి హిందూ మతంలో చేరాలని కోరతానని ప్రకటించారు. ట్రిపుల్ తలాక్ పై పోరాడుతున్న ముస్లిం మహిళలను ముస్లిం మతపెద్దలైన మౌల్వీలు ఫత్వాలు జారీ చేసి మరీ ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. సాధ్వీ ప్రాచీకి ఇటువంటి సంచలన విమర్శలు చేయడం కొత్తేమీ కాదు. నిన్న కూడా ఆమె రాహుల్ గాంధీపై ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రభుత్వం ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోతే కనీసం రాహుల్ గాంధీకి భార్య అయినా రావాలని గోరఖ్ నాథ్ ఆలయంలో దేవుడిని కోరినట్లు పేర్కొన్నారు.

Similar News