వైసీపీపై వ్యతిరేకత బాగా పెరిగింది

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నేత సబ్బం హరి తెలిపారు. అందుకనే పంచాయతీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ బలాన్ని పెంచుకోగలిగారన్నారు. [more]

Update: 2021-03-07 02:28 GMT

ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నేత సబ్బం హరి తెలిపారు. అందుకనే పంచాయతీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీ బలాన్ని పెంచుకోగలిగారన్నారు. విశాఖలో వైసీపీ గెలిస్తే మరిన్ని అరాచాకాలకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు. వైసీపీ దృష్టిలో ఇప్పడు ఎన్నికలే ఉన్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ లేదని సబ్బం హరి తెలిపారు. స్థానికేతరులను గెలిపించవద్దని సబ్బం హరి ఈ సందర్భంగా విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News