విశాఖలో నేనెప్పుడూ ఇలా చూడలేదు

టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై టీడీపీ నేత సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి ఘటనలను ఎప్పుడూ తన జీవితంలో [more]

Update: 2020-02-29 03:53 GMT

టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ ఎయిర్ పోర్టులో అడ్డుకోవడంపై టీడీపీ నేత సబ్బం హరి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ఇలాంటి ఘటనలను ఎప్పుడూ తన జీవితంలో చూడలేదని సబ్బం హరి అన్నారు. ప్రయివేటు వ్యక్తులను రంగంలోకి దింపి చంద్రబాబును అడ్డుకున్నారన్నారు. రౌడీ రాజకీయాలకు వైసీపీ తెరతీసిందన్నారు. జగన్ తొమ్మిది నెలల పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదన్నారు. పోలీసులు కూడా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్నారు. గతంలో జగన్ ను ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారన్న ఏకైక కారణంతోనే ఇప్పుడు చంద్రబాబును అడ్డుకున్నారని సబ్బం తెలిపారు. విశాఖపట్నానికి ఒక్క సెక్రటేరియట్ తీసుకువస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. జగన్ తన పతనాన్ని తానే కొనితెచ్చుకుంటున్నారని సబ్బం హరి అన్నారు.

Tags:    

Similar News