బ్రేకింగ్: శబరిమల బోర్డు సంచలన నిర్ణయం

శబరిమల వివాదంలో దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని వయస్సుల మహిళలకూ ఆలయ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆలయ [more]

Update: 2019-02-06 09:11 GMT

శబరిమల వివాదంలో దేవస్థానం బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని వయస్సుల మహిళలకూ ఆలయ ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఆలయ బోర్డు తెలియజేసింది. ఇప్పటివరకు పదేళ్ల నుంచి యాభై ఏళ్ల మధ్య వయస్సు ఆడవారికి శబరిమల దేవస్థానంలోనికి ప్రవేశం కల్పించలేదు. తాజాగా అన్ని వయస్సుల వారూ ఆలయంలోకి వెళ్లవచ్చని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో కొందరు మహిళలు ఆలయ ప్రవేశం చేయడం.. సంప్రదాయవాదులు, హిందూ సంస్థలు వ్యతిరేకించి ఆందోళన చేయడం తెలిసిందే. అయితే, ఇప్పుడు దేవస్థానం బోర్డే… అన్ని వయస్సుల మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తామని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేవస్థానం నిర్ణయంతో ఇక నుంచి అన్ని వయస్సుల మహిళలు ఆలయ ప్రవేశం చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News