ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు..!

హైదరాబాద్ లో దొంగలు ఏకంగా ఆర్టీసీ బస్సుకే ఎసరు పెట్టారు. అర్థరాత్రి వేళ డిపోలో పార్క్ చేసిన బస్సునే చోరీ చేశారు కేటుగాళ్లు. రాత్రి పార్కింగ్ చేసిన [more]

Update: 2019-04-25 06:14 GMT

హైదరాబాద్ లో దొంగలు ఏకంగా ఆర్టీసీ బస్సుకే ఎసరు పెట్టారు. అర్థరాత్రి వేళ డిపోలో పార్క్ చేసిన బస్సునే చోరీ చేశారు కేటుగాళ్లు. రాత్రి పార్కింగ్ చేసిన బస్సు ఉదయం కనిపించకపోవడంతో డ్రైవర్ కుయ్యోమొర్రో అంటూ పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు. హైదరాబాద్ కోఠిలోని సీబీఎస్ లో నిన్న అర్థరాత్రి ఓ ఆర్టీసీ బస్సును డ్రైవర్ పార్క్ చేసి వెళ్లాడు. అయితే భద్రతా సిబ్బంది అప్రమత్తంగా లేకపోవడాన్ని గమనించిన దొంగలు ఏకంగా బస్సునే చోరీ చేశారు. ఉదయం మళ్లీ డ్యూటీకి వచ్చిన డ్రైవర్ బస్సు లేకపోవడంతో అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బస్సు తెల్లవారు జామున తూప్రాన్ వద్ద టోల్ గేట్ దాటినట్లు పోలీసులు గుర్తించారు. నాందేడ్ వైపు బస్సును దొంగలు తీసుకువెళుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags:    

Similar News