ఏపీ, తెలంగాణల మధ్య?

ఏపీ, తెలంగాణ ల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం కానట్లే కన్పిస్తుంది. రాష్ట్రాల మధ్య రవాణా రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చి పక్షం రోజులు [more]

Update: 2020-06-25 02:58 GMT

ఏపీ, తెలంగాణ ల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పట్లో ప్రారంభం కానట్లే కన్పిస్తుంది. రాష్ట్రాల మధ్య రవాణా రాకపోకలకు కేంద్రం అనుమతి ఇచ్చి పక్షం రోజులు అవుతున్నా రెండు రాష్ట్రాలు ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. దీనికి కారణం రెండు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటమే. రెండు రాష్ట్రాలకు చెందిన ఆర్టీసీ అధికారులు కలసి కూర్చుని చర్చించుకుందామనుకున్నా వాయిదా పడటంతో ఇప్పట్లో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం కావని తెలుస్తోంది.

Tags:    

Similar News