ఠాకూర్ ది నేడు తేలిపోనుందా..?

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేడుకూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కమిషన్ ను కలసిన ఠాకూర్ ఈరోజు మరోసారి కమిషన్ అధికారులను కలవనున్నారు. [more]

Update: 2019-04-05 04:39 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నేడుకూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కమిషన్ ను కలసిన ఠాకూర్ ఈరోజు మరోసారి కమిషన్ అధికారులను కలవనున్నారు. నిన్న ఏసీబీ డీజీ ఇన్ ఛార్జి పదవి నుంచి ఆర్పీ ఠాకూర్ ను ఎన్నికల సంఘం తప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికార తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆయనను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నారు.

నేడు కూడా…..

నిన్న కేంద్ర ఎన్నికల కమిషనర్ అరోరాను కలిసిన ఠాకూర్ ఈరోజు మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలవనున్నారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఆయన కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరణ ఇవ్వనున్నారు. డీజీపీ గా ఉన్న ఠాకూర్ తన సొంత వాహనంలోనే డబ్బులు వసూలు చేస్తున్నారని, పోలీసు అధికారుల పదోన్నతులపై కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని సాక్ష్యాలతో కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News