జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లొంగిపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు కూడా [more]

Update: 2021-09-02 06:54 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు లొంగిపోయారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్ కు కూడా వెళ్లలేదన్నారు. కేసీఆర్ చేస్తున్న దగా మరోసారి నిరూపితమయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మోదీని టీఆర్ఎస్ ఎంపీలు రహస్యంగా కలసి వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలపై సమర్థవంతమైన వాదన విన్పించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. నీటి పంపకాల్లో తెలంగాణకు టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. కేసీఆర్ కృష్ణా జలాల వివాదం పై కేంద్ర ప్రభుత్వానికి ఒక్క వినతి పత్రాన్ని కూడా అందివ్వలేదని అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కేసీఆర్ తాకట్టు పెట్టాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Tags:    

Similar News