కేసీఆర్ దత్తత గ్రామంలో రేవంత్ రెడ్డి?

కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. కేసీఆర్ దళితులకు మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఈ పర్యటనల [more]

Update: 2021-08-23 06:43 GMT

కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. కేసీఆర్ దళితులకు మోసం చేస్తున్నారన్న విషయాన్ని ఈ పర్యటనల ద్వారా రేవంత్ రెడ్డి నిరూపించాలని భావిస్తున్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామమైన మూడు చింతలపల్లె నుంచే ఈ పర్యటన ప్రారంభం కానుంది. దత్తత గ్రామానికి సీఎం కేసీఆర్ ఏం చేయలేదని, ఇక రాష్ట్రంలో దళితులకు ఏం చేస్తారని అక్కడి నుంచే రేవంత్ రెడ్డి ప్రశ్నించనున్నారు. ఈ నెల 24, 25 దళిత, గిరిజన దండోరా సభలను నిర్వహించిన తర్వాత పర్యటన తేదీ ఖరారవుతుంది.

Tags:    

Similar News