కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయం

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగష్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారని తెలిపారు. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు [more]

Update: 2021-07-09 13:44 GMT

కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022 ఆగష్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేయనున్నారని తెలిపారు. మరోసారి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేటీఆర్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ ఇవ్వరని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనను టీడీపీ అని విమర్శిస్తున్న వారు కేసీఆర్ ఏ పార్టీయో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ టీఆర్ఎస్ కు ఎలా అధ్యక్షుడో తాను కాంగ్రెస్ కు అధ్యక్షుడనని చెప్పారు. కేసీఆర్ కేబినెట్ లో ఉన్నవారిలో 75 శాతం మంది టీడీపీ వారేనని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News