ఏపీ తెలంగాణ సరిహద్దుల్లో పెరిగిన ఆంక్షలు

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు మరింత పెరిగాయి. ఏపీలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఉదయం 12 గంటల తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి [more]

Update: 2021-05-11 00:45 GMT

ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు మరింత పెరిగాయి. ఏపీలో 18 గంటల పాటు కర్ఫ్యూ అమలులో ఉండటంతో ఉదయం 12 గంటల తర్వాత తెలంగాణ నుంచి ఏపీలోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఇక తెలంగాణ కూడా కొన్ని ఆంక్షలు విధించింది. తెలంగాణ ఆసుపత్రుల్లో పడకలు నిండిపోవడంతో ఏపీ నుంచి తెలంగాణ ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వచ్చే వారిని అనుమతించడం లేదు. హైదరాబాద్ లో ఆసుపత్రి అంగీకార పత్రం ఉంటేనే అనుమతిస్తున్నారు. అంబులెన్స్ లను కూడా తెలంగాణ పోలీసులు ఏపీకి వెనక్కు తిప్పిపంపుతున్నారు. హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రుల్లో పడకలు నిండుకోవడమే దీనికి కారణమంటున్నారు. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో ఇది సర్దుమణిగిందంటున్నారు.

Tags:    

Similar News