రెబల్ ఎమ్మెల్యేలు మరింత రెబల్ గా

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఈరోజు ఉదయం 11గంటలకు తనను కలవాలని రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి [more]

Update: 2019-07-23 06:58 GMT

కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ ఈరోజు ఉదయం 11గంటలకు తనను కలవాలని రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే రెబల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోగా, స్పీకర్ కు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. తాము ఇప్పటికే రాజీనామా చేసిన విషయాన్ని స్పీకర్ కు లేఖలో రెబల్ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. అనర్హత పిటిషన్ పై తాము హాజరుకావడానికి కనీసం నాలుగు వారాల గడువు కావాలని కోరారు. ఈ మేరకు 13 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖరాయడంతో వారిపై ఆయన ఎలాంటి చర్యలకు దిగుతారన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News