అమరావతి అక్కడే ఉంటుందట

రాజధాని అమరావతి అక్కడే ఉంటుందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాజధాని తరలింపు ఆగిపోతుందని రాయపాటి స్పష్టం చేశారు. వెలగపూడి నుంచే కార్యకలాపాలు ఉంటాయన్నారు. తిరుమలలో [more]

Update: 2020-02-06 04:12 GMT

రాజధాని అమరావతి అక్కడే ఉంటుందని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. రాజధాని తరలింపు ఆగిపోతుందని రాయపాటి స్పష్టం చేశారు. వెలగపూడి నుంచే కార్యకలాపాలు ఉంటాయన్నారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని రైతులు గత యాభై రోజులుగా చేస్తున్న పోరాటానికి ఫలితం ఉంటుందని రాయపాటి సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు రాజధాని రైతులు ప్రధానమంత్రి మోదీని కలవనున్నారని చెప్పారు.

Tags:    

Similar News