ఈ రాజకీయాలు నాకొద్దు

రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఇటీవల రాయపాటి [more]

Update: 2020-01-04 08:03 GMT

రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో చేరబోవడం లేదని, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని రాయపాటి సాంబశివరావు తెలిపారు. ఇటీవల రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. రాయపాటితో పాటు ఆయన కుమారుడు రంగారావుపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. దీంతో ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. తన సన్నిహితులే కొందరు తనపై సీబీఐకి ఫిర్యాదు చేశారని రాయపాటి సాంబశివరావు తెలిపారు.

Tags:    

Similar News