రాపాకకు షాకిచ్చిన జనసైనికులు

రాజోలు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాకిచ్చారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు [more]

Update: 2021-03-23 00:50 GMT

రాజోలు నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు షాకిచ్చారు. తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని మల్కిపురంలో జనసేన బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సభకు రావద్దంటూ జనసేన కార్యకర్తలు రాపాక వరప్రసాద్ కు షాకిచ్చారు. నిజానికి ఆ సభకు ఆయన హాజరయ్యే అవకాశం లేదు. ఆయన ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. అయినా రాపాక వరప్రసాద్ పరువు తీసేందుకు జనసైనికులు తమ సభకు నో ఎంట్రీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News