మొండి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా…?

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మే డే సందర్భంగా నిరసనలు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మే 1వ తేదీన [more]

Update: 2021-04-28 01:17 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మే డే సందర్భంగా నిరసనలు తెలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మే 1వ తేదీన కార్మిక దినోత్సవ సందర్భంగా ఎర్రజెండాలు ఎగురవేయాలని కోరారు. నాలుగు నెలల నుంచి రైతులు రోడ్డెక్కి ఉద్యమిస్తున్నా మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రామకృష్ణ అన్నారు. కరోనా రీత్యా ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకుండా వేడుకలను నిర్వహించాలని, పార్టీ శ్రేణులు ఆ రోజున శ్రమదానం చేసి, మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేయాలని రామకృష్ణ పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News