రాజాసింగ్ సెన్సేషనల్ డెసిషన్

భారతీయ జనతా పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహల్ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ నిర్ణయం అందరినీ [more]

Update: 2019-01-06 12:01 GMT

భారతీయ జనతా పార్టీ ఒకే ఒక ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు. గోషామహల్ నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన రాజాసింగ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపర్చేలా ఉంది. ఈ నెల 17వ తేదీన ఎంఐఎం ఎమ్మెల్యే ను ప్రొటెం స్పీకర్ గా ప్రమాణస్వీకారం చేయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే రాజాసింగ్ కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. భారత్ మాతాకు జై అనని వారిని ప్రొటెం స్పీకర్ గా ఎలా నియమిస్తారంటూ మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కు తీసుకోవాలన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్ గా ఉన్నంత వరకూ తాను అసెంబ్లీకి వెళ్లేది లేదని చెప్పారు. న్యాయనిపుణులతో మాట్లాడి తన తదుపరి నిర్ణయం ప్రకటిస్తానని రాజాసింగ్ తెలిపారు.

Tags:    

Similar News