రాజాసింగ్ హత్యకు కుట్ర జరిగిందా?

Update: 2018-04-09 02:24 GMT

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హత్యాయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఔరంగాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. లారీని ఢీకొట్టిన వెంటనే డ్రైవర్ పరారవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సురక్షితంగా బయటపడ్డారని ఆయన సన్నిహితులు చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News