రోజుకు రూ.17 ఇచ్చి అవమానిస్తారా..?

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సేవ్ నేషన్ – సేవ్ డెమాక్రసీ’ పేరుతో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ [more]

Update: 2019-02-01 12:29 GMT

కేంద్ర బడ్జెట్ పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సేవ్ నేషన్ – సేవ్ డెమాక్రసీ’ పేరుతో శుక్రవారం ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, చంద్రబాబు సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఒక రోజుకు రూ.17 ఇచ్చి వారిని తీవ్రంగా అవమానించారని ఆయన ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో బీజేపీ అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. ఇందుకు సంబంధించి సోమవారం ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News