వైసీపీకి కరోనా కాదు.. డరోనా

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. కరోనా ఉందని స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీకి కరోనా లేక [more]

Update: 2020-10-30 08:11 GMT

వైసీపీ ప్రభుత్వంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఫైర్ అయ్యారు. కరోనా ఉందని స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైసీపీకి కరోనా లేక డరోనా అని ఆయన ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొంటేనే కరోనా వస్తుందా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. లిక్కర్ షాపుల వద్ద క్యూలకు కరోనా వర్తించదా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థలను జరపాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జరిగిన ఏకగ్రీవాలన్నింటినీ రద్దు చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. విజయసాయిరెడ్డి స్థాయికి తగ్గ విమర్శలు చేస్తే మంచిదని సూచించారు. స్కూళ్లు కూడా తెరుస్తున్నారని, ఇక ఎన్నికలకు వెళ్లడానికి వైసీపీకి ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News