అప్పుడే నేను రాజీనామా చేస్తా

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరోక్షంగా జగన్ కు సవాల్ విసిరారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుస్తానన్నారు. అయితే అమరావతిని రాజధానిగా [more]

Update: 2020-09-12 02:45 GMT

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పరోక్షంగా జగన్ కు సవాల్ విసిరారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలుస్తానన్నారు. అయితే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటేనే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి విమర్శలకు రఘురామ కృష్ణంరాజు ఘాటు స్పందించారు. తాను టీడీపీకి వత్తాసు పలుకుతన్నాననడం సరికాదని ఆయన తెలిపారు. తాను పార్టీ మంచి కోసమే రాజధానిని అమరావతిలో కొనసాగించాలని పట్టుబడుతున్నానని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. అయితే సీఎం జగన్ తాను రాజధానిగా అమరావతిని కొనసాగిస్తానని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే రాజీనామా చేస్తానని చెప్పారు.

Tags:    

Similar News