అమరావతి పర్యటనకు అనుమతివ్వండి

రాజధాని అమరావతి పర్యటనకు అనుమతించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈమేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. తాను అమరావతిలో పర్యటించాలను కుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని [more]

Update: 2020-08-21 02:16 GMT

రాజధాని అమరావతి పర్యటనకు అనుమతించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈమేరకు ఆయన డీజీపీకి లేఖ రాశారు. తాను అమరావతిలో పర్యటించాలను కుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని ఆయన కోరారు. అమరావతి రైతులకు న్యాయం జరిగి తీరుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. రైతులు ఆందోళన చెందాల్సన అవసరం లేదన్నారు. సీఆర్డీఏ చట్టం గురించి తమకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదని కేంద్ర ప్రభుత్వం తన అఫడవిట్ లో పేర్కొన్న విషయాన్ని రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని రంగాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను డెవలెప్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన కామెడీ గా అభివర్ణించారు.

Tags:    

Similar News