జగన్ కు రఘురామ కృష్ణంరాజు మరో లేఖ

ఏపీ ముఖ్మమంత్రి జగన్ రెబెల్ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు మరో లేఖ రాశారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్య ఆలయనిర్మాణానికి భూమి పూజ జరగనుందున ఆరోజు ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2020-07-31 06:07 GMT

ఏపీ ముఖ్మమంత్రి జగన్ రెబెల్ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు మరో లేఖ రాశారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్య ఆలయనిర్మాణానికి భూమి పూజ జరగనుందున ఆరోజు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేలా ఆదేశివ్వాలని లేఖలో రఘురామ కృష్ణంరాజు అన్నారు. 24 వేల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద పఠనం చేయాలని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న భూమి పూజ కార్యక్రమాన్ని టీటీడీకి చెందని ఎస్సీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయాలని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో జగన్ ను కోరారు.

Tags:    

Similar News