రాజుగారిపై వైసీపీ మైండ్ గేమ్

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మరో ఫిర్యాదు అందింది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ రఘురామకృష్ణంరాజు [more]

Update: 2020-07-09 07:33 GMT

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పై మరో ఫిర్యాదు అందింది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కించపరుస్తూ రఘురామకృష్ణంరాజు మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రసాదరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మంత్రి రంగనాధరాజు, ఎమ్మెల్యే గ్రంధీ శ్రీనివాస్ లు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. నర్సాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఐదుగురు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో రఘురామకృష్ణంరాజుపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. మొత్తం మీద వరస ఫిర్యాదులతో రఘురామకృష్ణంరాజుపై వైసీపీ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందనే చెప్పాలి.

Tags:    

Similar News