Raghurama : పోలీసుల వల్లే మా ప్రభుత్వానికి అప్రదిష్ట

స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా నిర్వహించడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కడప జిల్లాలో అక్బర్ [more]

Update: 2021-09-13 07:47 GMT

స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం గత కొన్ని నెలలుగా నిర్వహించడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కడప జిల్లాలో అక్బర్ భాషా స్పందనలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఆయన వైసీపీ నేత తిరుపాల్ రెడ్డి పై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదని రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. పోలీసుల పనితీరుతో ప్రభుత్వం విమర్శల పాలవుతుందని అన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణరాజు కోరారు.

Tags:    

Similar News