జగన్ విహార యాత్రలో ఉన్నప్పుడే?

జగన్ విహార యాత్రలో ఉన్నప్పుడే మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో హాట్ కామెంట్స్ చేయడం మామూలేనని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధానిని తరలిస్తామని బొత్స చెప్పడమేంటని [more]

Update: 2021-08-30 07:47 GMT

జగన్ విహార యాత్రలో ఉన్నప్పుడే మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో హాట్ కామెంట్స్ చేయడం మామూలేనని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. రాజధానిని తరలిస్తామని బొత్స చెప్పడమేంటని ప్రశ్నించారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని ఎలా చెబుతారని రఘురామ కృష్ణరాజు అన్నారు. ఒక రాజధాని అమరావతిలోనే ఉంటుంది కదా? అన్న బొత్స సమాధానం నవ్వు తెప్పించేలా ఉందన్నారు. మూడు రాజధానులు బుద్ధి ఉన్నవాళ్లు ఎవరూ ప్రతిపాదించరని రఘురామ కృష్ణరాజు అన్నారు. న్యాయస్థానాలపై వీరికి దారుణమైన అభిప్రాయం ఉందన్నారు. కర్నూలులో మానవహక్కుల కమిషన్ పెట్టారని, శ్రీకాకుళం ప్రజలు కర్నూలుకు వెళ్లాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. విశాఖను ఏపీ రాజధానిగా ఎలా చెబుతారంటూ పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాసినట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు.

Tags:    

Similar News