2014 పరిస్థితులను తెచ్చుకోకండి.. జగన్ కు రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు పదో లేఖ రాశారు. పార్టీ మంచి కోసం విజయసాయిరెడ్డిని కట్టడి చేయాలని [more]

Update: 2021-06-19 05:33 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈరోజు పదో లేఖ రాశారు. పార్టీ మంచి కోసం విజయసాయిరెడ్డిని కట్టడి చేయాలని ఆయన కోరారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయాల విషయంలో అశోక్ గజపతి రాజు న్యాయపరంగా గెలిచారని, ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డిని, కొందరు మంత్రులను కట్టడి చేయాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. లేకుంటే పార్టీకి తీవ్రంగా నష్టం చేకూరుతుందని ఆయన జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో తిరిగి 2014 పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

Tags:    

Similar News