గుండె మీద చేయి వేసుకుని చెబుతున్నా… జగన్ వెంటే ఉంటా

తాను జగన్ వెంటే ఉంటానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్ కు కొందరు ఎమ్మెల్యేలు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వల్లనే జగన్ కు [more]

Update: 2020-06-16 14:14 GMT

తాను జగన్ వెంటే ఉంటానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్ కు కొందరు ఎమ్మెల్యేలు చెడ్డపేరు తెస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ వల్లనే జగన్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్పారు. జగన్ తోనే తాను ఉండాలనుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు అన్నారు. జగన్ 30 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు టిక్కెట్ విషయంలో ప్రశాంత్ కిషోర్ మాత్రమే తనతో మాట్లాడారన్నారు. ఆయన బతిమాలితేనే తాను పార్టీలోకి వచ్చానని చెప్పారు. తాను ముఖ్యమంత్రి జగన్ ను ఏమీ ఇంతవరకూ అనలేదని, తనను దూషించిన వారిని మాత్రమే అన్నానని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఎప్పటికైనా తాను జగన్ తో మాట్లాడతానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని సమయం అడిగానని చెప్పారు.

Tags:    

Similar News