జగన్ కు ఈరోజు రాసిన లేఖలో?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏడో లేఖ రాశారు. ఈరోజు రాసిన లేఖలో రైతు భరోసా సాయాన్ని [more]

Update: 2021-06-16 03:42 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏడో లేఖ రాశారు. ఈరోజు రాసిన లేఖలో రైతు భరోసా సాయాన్ని అందించాలని కోరారు. గత ఎన్నికలకు ముందు రైతులు వైసీపీకి అండగా నిలిచారని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలను కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 13, 500 ఇవ్వాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. కేంద్ర సాయంతో కలిపి రైతులకు మొత్తం 19,500 లు ఇస్తేనే హమీ నిలబెట్టుకున్నట్లు అవుతుందని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News