వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది…ఖతమయినట్లే

వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు [more]

Update: 2021-03-10 01:10 GMT

వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు అనవసరంగా పార్లమెంటులో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రశ్నను లేవనెత్తి వైసీపీయే ఇబ్బందికి గురయిందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో అడిగి మరీ నెగిటివ్ జవాబు చెప్పించుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పే ప్రయివేటీకరణ చేస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పడంతో ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటేయరన్నారు. వైసీపీ సెల్ఫ్ గోల్ వేసుకుందని, ఇంతోటి దానికి జగన్ కు వంద మంది సలహాదారులు అవసరమా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

Tags:    

Similar News