Breaking : జగన్ బెయిల్ రద్దుపై హైకోర్టు కు రఘురామ

జగన్ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో తీర్పు [more]

Update: 2021-09-14 07:42 GMT

జగన్ బెయిల్ పిటీషన్ ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టులో తీర్పు రిజర్వ్ అయింది. అయితే ఇందులో తన పిటీషన్ కొట్టివేస్తే ఎలా అన్న దానిపై ఆలోచించి హైకోర్టును ఆశ్రయించానని రఘురామ కృష్ణరాజు తెలిపారు. సాక్షి మీడియాలో తీర్పు రాకముందే తన పిటీషన్ కొట్టివేసినట్లు వార్తలు వచ్చాయన్నారు. న్యాయస్థానాలపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. సీబీఐ కోర్టు లో తన పిటీషన్ ను కొట్టివేస్తే న్యాయంపైనే అపనమ్మకం ఏర్పడుతుందని, అందుకే మరో బెంచ్ కు మార్చాలని తాను లంచ్ మోషన్ పిటీషన్ వేసినట్లు రఘురామ కృష్ణరాజు తెలిపారు.

Tags:    

Similar News