పుల్వామా దాడి: పాక్ ఖైదీని చంపిన భారత ఖైదీలు

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులంతా పాకిస్థాన్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై కోపాన్ని రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైలులో ఖైదీలు తోటి [more]

Update: 2019-02-20 11:28 GMT

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులంతా పాకిస్థాన్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పై కోపాన్ని రాజస్థాన్ లోని జైపూర్ సెంట్రల్ జైలులో ఖైదీలు తోటి పాకిస్థాన్ ఖైదీపై చూపించారు. గూఢచర్యం ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న షకీర్ అనే పాక్ ఖైదీపై ముగ్గురు తోటి ఖైదీలు దాడికి పాల్పడిన హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలోనే ఖైదీలు ఆగ్రహంతో హత్య చేసి ఉంటారని అధికారులు అంటున్నారు. కశ్మీర్ లోని పుల్వామాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి పాల్పడి 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News