బ్రేకింగ్ : కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల ఏర్పాటు కోసం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 [more]

Update: 2020-08-07 12:04 GMT

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాల ఏర్పాటు కోసం చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశముంది. కమిటీ నియమించడంతో జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమయినట్లే. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అందులో భాగంగానే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయింది. మూడు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News