ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు

ఎన్నికలను ప్రభావితం చేసేలా సర్వే పేరుతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్త ప్రచురించిన ఆ పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. [more]

Update: 2019-04-10 13:55 GMT

ఎన్నికలను ప్రభావితం చేసేలా సర్వే పేరుతో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వార్త ప్రచురించిన ఆ పార్టీ అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతికి ప్రెస్ కౌన్సిల్ నోటీసులు జారీ చేసింది. వారం క్రితం లోక్ నీతి – సీఎస్డీఎస్ సర్వే చేసిందని, తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తేలినట్లు ఓ వార్త మొదటి పేజీ రాసింది. అయితే, అసలు తాము ఎలాంటి సర్వే చేయలేదని, పత్రికలో ప్రచురితమైన వార్త అబద్ధమని సదరు సంస్థ వెంటనే ప్రకటన ఇచ్చింది. దీంతో ఆంధ్రజ్యోతి తప్పుడు వార్త రాసిందని ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు అందింది. దీంతో 14 రోజుల్లో ఈ వార్తపై వివరణ ఇవ్వాలని ప్రెస్ కౌన్సిల్ ఆంధ్రజ్యోతికి నోటీసులు జారీ చేసింది.

Tags:    

Similar News