చంద్రబాబుకు ప్రశాంత్ కిషోర్ స్ట్రాంగ్ కౌంటర్

తనను పదేపదే విమర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జేడీయూ నేత, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బిహారీ బంధిపోటు అంటూ చంద్రబాబు [more]

Update: 2019-03-19 07:02 GMT

తనను పదేపదే విమర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జేడీయూ నేత, వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. బిహారీ బంధిపోటు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ''ఓటమి దగ్గర పడినప్పుడు ఎంతటి అనుభవజ్ఞుడైన రాజకీయ నేత అయినా వణికిపాతారు. చంద్రబాబు వ్యాఖ్యలు నాకు పెద్దగా ఆశ్చర్యంగా అనిపించడం లేదు. తనను దూషించడం చంద్రబాబుకు బిహార్ పట్ల ఉన్న ద్వేషం, చెడు అభిప్రాయం బయటపెడుతోంది. నన్ను తిట్టడం కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్లీ మీకు ఓటు ఎందుకు వేయాలనే దానిపై దృష్టి పెట్టండి'' అని ట్వీట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు ఇటీవల తరచూ విమర్శిస్తున్నారు. ఓ రాజకీయ నేత, ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఆయనను బంధిపోటు అని దూషించిన విషయం తెలిసిందే.



Tags:    

Similar News