బ్రేకింగ్ :బాబు చేతిలోనే ఉందన్న జేసీ

Update: 2018-09-19 06:50 GMT

తాడిపత్రిలో ఆశ్రమం నడుపుతున్న ప్రభోదానందపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం ప్రభోదానంద అనుచరులకు, పెద్దకనమల, చిన్నకనమల గ్రామాల ప్రజల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. దాడులకు నిరసనగా ఆశ్రమం వద్ద ఆందోళణ చేస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపైనా దౌర్జన్యం చేశారు. దీనిపై బుధవారం దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితిని వివరించారు. ప్రభోదానందకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా అందించినట్లు తెలిసింది. ప్రభోదానంద అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, ప్రభోదానంద బలవంతుడు కాబట్టే తనపై దాడి చేశాడని, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలని జేసీ వ్యాఖ్యానించారు.

Similar News