షర్మిల ఫిర్యాదుతో డొంక కదులుతోంది..!

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో యూట్యుబ్ ఛానళ్ల డొంక కదులుతోంది. ఎఫైర్ పేరుతో విడియోలు తయారు చేసి దుష్రచారం చేస్తున్న ఛానళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే [more]

Update: 2019-01-19 13:24 GMT

వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం కేసులో యూట్యుబ్ ఛానళ్ల డొంక కదులుతోంది. ఎఫైర్ పేరుతో విడియోలు తయారు చేసి దుష్రచారం చేస్తున్న ఛానళ్ల సమాచారాన్ని పోలీసులు సేకరించారు. ఇప్పటికే 8 ఛానళ్లకు నోటిసులు జారీ చేశారు. వారిలో ఐదుగురికి అరెస్ట్ వారెంట్ లు జారీ చేశారు. 10 రోజుల్లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఇవ్వాలంటూ అదేశించారు. ఐపీ అడ్రస్ అధారంగా విచారణ ముమ్మరం చేశారు. యూట్యూబ్ ఛానళ్ల యజమానులను పిలిచి విచారిస్తున్న పోలీసులు వారికి నోటీసులు ఇస్తున్నారు.

యజమానులు హాజరుకాకుండా….

యూట్యూబ్ యజమానాలు హాజరుకాకుండా ఉద్యోగులను పంపిస్తుండడంతో స్వయంగా వారే హాజరుకావాలంటూ పోలిసులు అదేశించారు. అప్పుడే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలిసులు భావిస్తున్నారు. అసత్య ప్రచారాల వీడియోలు ఎవరు చేస్తున్నారు.? ఎందుకు చేస్తున్నారన్న కూపి లాగుతున్నారు పోలిసులు. యూట్యూబ్ లో ఛానళ్ల లింకులకు అశ్లీల, అసభ్యకరమైన కామెంట్స్ పెట్టే వ్యక్తులను గుర్తించేందుకు దూకుడు పెంచారు పోలిసులు. వ్యక్తిగత దూషణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు రంగం సిద్దం చేస్తున్నారు. టాలీవుడ్ నగర్, విసపోర్ట్ టివి, టిపిఎఫ్ టివి, జింగ్ జింగ్ టివి, మూవీ టైం, సిల్వర్ స్క్కీన్, టాలివుడ్ నగర్, ఛాలెంజ్ మంత్ర, తెలుగు ఫిలిం స్క్రీన్ అనే యూట్యూబ్ ఛానళ్ల యజమానులను పిలిచి విచారించారు పోలీసులు. ఇందులో ఐదుగురికి 41సీఅర్ పిసి ప్రకారం నోటిసులు అందజేశారు.

Tags:    

Similar News