బస్సులో కాల్పులు… ఏపీ పోలీసు పని..!

ఇవాళ ఉదయం హైదరాబాద్ పంజాగుట్టలో ప్రయాణికులతో గొడవ పడి బస్సులో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపింది శ్రీనివాస్ గా గుర్తించిన టాస్క్ [more]

Update: 2019-05-02 12:47 GMT

ఇవాళ ఉదయం హైదరాబాద్ పంజాగుట్టలో ప్రయాణికులతో గొడవ పడి బస్సులో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్పులు జరిపింది శ్రీనివాస్ గా గుర్తించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ ఏపీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో పనిచేస్తున్నాడు. ఆతడిని సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు సైతం హైదరాబాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే, ప్రజల్లో కాల్పులు జరపడం పెద్ద నేరమని, దీనిపై విచారణ జరిపి కాల్పులు జరిపిన శ్రీనివాస్ పై చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ ఠాకూర్ పేర్కొన్నారు. తమ శాఖలో ఎటువంటి పని ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News