బ్రేకింగ్ : హత్య కేసును గంటల్లోనే ఛేదించారు

హైదరాబాద్ నగరంలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసులో పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరిని ఇప్పటికే [more]

Update: 2020-06-06 04:56 GMT

హైదరాబాద్ నగరంలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసులో పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడ్డ ఆరుగురు నిందితులను అధికారులు గుర్తించారు. ఇందులో ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ జంట హత్యలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ సంఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెంటనే ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కొన్ని గంటల్లోనే హత్య కేసును ఛేదించారు. రౌడీషీటర్లు చాంద్, ఇబ్రహీం కు మధ్య గొడవలు నడుస్తున్నాయి. వీరిద్దరి మధ్య గ్యాంగ్ వార్ కూడా నడుస్తున్నాయి. కొన్నాళ్ల నుంచి కూడా చందు ,ఇబ్రహీం కు భయపడి ముంబైలో తలదాచుకున్నాడు. ఇటీవల కాలంలో ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ఈ విషయాన్ని గుర్తించి చాంద్ ను చంపాలని ప్లాన్ చేసి ఖతం చేశాడు. హత్యలో పాలుపంచుకున్న ఆరుగురికి సంబంధించిన వివరాలను రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News