బెజవాడలో కర్ఫ్యూ.. నాలుగు రోజుల్లోనే…?

విజయవాడలో కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల్లోనే పదహారు లక్షల జరిమానాను విధించారు. 350 వాహనాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2021-05-12 00:49 GMT

విజయవాడలో కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నాలుగు రోజుల్లోనే పదహారు లక్షల జరిమానాను విధించారు. 350 వాహనాలను సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంది. అయితే కర్ఫ్యూ సమయంలోనూ కొందరు యధేచ్ఛగా బయటకు వస్తున్నారు. మాస్క్ లు కూడా ధరించకుండా తిరుగుతున్నారు. దీంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఏపీకి వెళ్లాలనుకునే వారికి ఆంక్షలు మరింత కఠినతరం చేశారు పోలీసులు. 12 గంటల తర్వాత ఏపీలోకి ప్రవేశించాలంటే ఈపాస్ ఉండాలని నిబంధన పెట్టారు.

Tags:    

Similar News