బ్రేకింగ్ : జగన్, కేసీఆర్ లకు ప్రధాని మోదీ ఫోన్

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రెండు [more]

Update: 2020-07-19 13:10 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత పెరుగుతున్న కేసులు, కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇద్దరూ టెస్ట్ ల సంఖ్య పెంచామని, మినహాయింపుల తర్వాత కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట వారాంతాల్లో లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ తెలిపినట్లు తెలిసింది.

Tags:    

Similar News