బాబుకు అదే గతి పట్టడం ఖాయం

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి పరిస్థితి తెలంగాణాలో మాదిరిగానే ఉంటుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ జోస్యం చెప్పారు. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్ అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని [more]

Update: 2019-01-07 07:01 GMT

ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబునాయుడి పరిస్థితి తెలంగాణాలో మాదిరిగానే ఉంటుందని కేంద్రమంత్రి పియూష్ గోయల్ జోస్యం చెప్పారు. టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్ అంశం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు దుష్టకూటమితో జత కడుతున్నారన్నారు. తెలంగాణలో టీడీపీకి అక్కడి ప్రజలు బుద్ధి చెప్పినట్లుగానే ఏపీలోనూ అదే తీర్పు రావడం ఖాయమన్నారు. ఏపీలో కాంగ్రెస్ తో జత కట్టడాన్ని అక్కడి ప్రజలు హర్షించరన్నారు. తాము ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని చెబితే ఆరోజు అంగీకరించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ప్యాకేజీ ప్రకటించినప్పుడు సంబరాలు చేసుకోవడం నిజం కాదా? అని నిలదీశారు.

Tags:    

Similar News