బ్రేకింగ్ : ఏపీలో మొదలు పెట్టారు… జియో ట్యాగింగ్ ద్వారా

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. మే 1వ తేదీ కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అందరికీ పింఛన్లు అందజేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి [more]

Update: 2020-05-01 04:19 GMT

ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. మే 1వ తేదీ కావడంతో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అందరికీ పింఛన్లు అందజేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లను లబ్దిదారులకు అందజేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద 58 లక్షల మందికి వైఎస్సార్ పింఛన్ ను వాలంటీర్లు అందజేస్తున్నారు. బయోమెట్రిక్ కు బదులుగా పింఛను దారుల ఫొటోలను జియో ట్యాగింగ్ చేస్తూ అందజేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ ను వినియోగిస్తున్నారు. మే 1వ తేదీ నాడే పింఛనును అందచేయాలన్న జగన్ ఆదేశంతో పింఛను పంపిణీ ఏపీలో ప్రారంభమయింది.

Tags:    

Similar News